Tuesday, 8 March 2022

దాచూరి రామిరెడ్డి విజ్ఞాన కేంద్రం విజయవంతం :: 1200 మంది రోగులకు ఉచిత OP, ఉచిత కన్సల్ టేషన్ మరియు 400 రూపాయలకే 4 నెలల మందులు

విజయవంతంగా ముగిసిన దాచురి రామిరెడ్డి విజ్ఞాన కేంద్రం వారి రెగ్యులర్ మెడికల్ క్యాంపు
సుధీర్ఘ విరామం తరువాత తిరిగి ఈరోజు 7/11/2021 ఆదివారం మెడికల్ క్యాంపు ప్రారంభం అయింది.
వైద్యం ఖరీదు అయిన ప్రస్తుత పరిస్థితుల్లో     బీపీ, షుగర్, పక్షవాతం రోగులకు 4 సంవత్సరాలుగా దాచురి రామిరెడ్డి విజ్ఞాన కేంద్రం పేరుతో మెడికల్ క్యాంపు నిర్వహిస్తూ 4.నెలలకు 400.రూపాయలకే మందులు అందిస్తున్న సంగతి తెలిసిందే..
కరోనా కారణంగా రోగులు ఇబ్బందులు పడకూడదు అనే ఉద్దేశంతో క్రమం తప్పకుండా మందులు అందిస్తున్నారు..
దాచురి రామిరెడ్డి విజ్ఞాన కేంద్రం మెడికల్ కన్వీనర్ మాదాల వెంకట్రావు,
  డాక్టర్ గోపాలం శివన్నారాయణ మరియు ప్రముఖ డాక్టర్లు సహకారంతో కార్యక్రమం జరుగుతుంది..
 అంకితభావంతో పనిచేస్తున్న కార్యకర్తలు,నిర్వాహకులు కృషి కారణంగా ఈరోజు జరిగిన క్యాంపు కు 1200 మంది పేసేంట్లు హాజరు ఐనారు.
ఈరోజు జరిగిన మెడికల్ క్యాంపు నందు
డా, చాపల వంశీకృష్ణ, డా, బి.శరత్,
డా, కె.శివప్రసాద్ రాజు, డా, యం.కృష్ణారెడ్డి, డా, యం.రవితేజ, డా, జాన్ రిచర్డ్స్, బి.హరిబాబు మరియు ఆర్.యం.పి.వైద్యులు వైద్య సేవలు అందించారు, వారందరికీ మరియు క్యాంపు నందు పని చేసిన  కార్యకర్తలందరికి విజ్ఞాన కేంద్రం కన్వీనర్ మాదాల వెంకట్రావు ధన్యవాదాలు తెలియచేసారు..

No comments:

Post a Comment