ప్రాచీన మధ్యయుగాల శాస్త్ర పద్ధతుల్లో సమూల మార్పులు సంభవించిన దశలో ఆధునిక విజ్ఞాన శాస్త్రం భారత దేశానికి వచ్చింది.
అప్పటికే నూతన విజ్ఞానశాఖలు అభివృద్ధి చెందాయి.
ప్రయోగాల ద్వారా జ్ఞానార్జన అనేది శాస్త్రీయ పద్ధతిగా నిలదొక్కుకుంది.
శాస్త్ర పరిశోధన సంస్థలు నిలదొక్కుకున్నాయి.
సాంకేతిక శాస్త్రం నిర్ణయాత్మకంగా ముందంజ వేసింది.
బ్రిటీషు వారు విజ్ఞాన శాస్త్రాన్ని ఇంగ్లీషు భాషలో ఇండియాలో ప్రవేశపెట్టడం వలన భారతీయులు విజ్ఞాన శాస్త్రాన్ని జీర్ణం చేసుకోలేకపోయారు.
అది బ్రిటీషు వారి శాస్త్రం కనుక వ్యతిరేకతను ఎదుర్కొంది.
అందువల్లనే శాస్త్రీయ దృక్పథం భారత దేశంలో నిలదొక్కుకోలేకపోయింది.
అది వృత్తిపని వారిదగ్గరకు చేరలేకపోయింది.
వైజ్ఞానిక విషయాల మీద చర్చ జరగక, భారత దేశం శాస్త్ర సాంకేతిక రంగాలలో వెనుక పడింది.
18 వ శతాబ్ది చివరలో విశ్వవిద్యాలయాలు విజ్ఞాన శాస్త్ర బోధనను నిర్లక్ష్యం చేశాయి.
పాఠశాల సిలబస్ లో సైన్సు భాగం కాలేదు.
కావెండీష్, ప్రీస్ట్లే, జేమ్స్ వాట్, హర్షల్ లాంటి ఉత్సాహవంతులైన వారు అనేక శాస్త్రీయ ఆవిష్కరణలను అప్పటికే చేశారు.
విద్యావకాశాలు, సాంఘిక అవసరాల మధ్య ఉన్నాఘాతాన్ని పూడ్చడానికి అనేక తాత్విక సంఘాలు ఏర్పడ్డాయి.
* లండన్ సిసైటీ ఆఫ్ ఆర్ట్స్.
* మాంచెస్టర్ లిటరరీ అండ్ ఫిలాసోఫికల్ సొసైటీ,(1781)
* బర్మింగ్ హామ్ లో లూనార్ సొసైటీ.(1766).
ఈ సంఘాలు సామాన్య ప్రజానీకానికి విజ్ఞాన శాస్త్రాన్ని పరిచయం చేయడానికి ప్రచారం నిర్వహించాయి.
1799 లో రమ్ ఫోర్డ్ అనే అతను రాయల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్రేట్ బ్రిటన్ ను స్థాపించడంలో ప్రముఖ పాత్ర పోషించాడు.
తాత్విక ఉపన్యాసాలు , విజ్ఞాన శాస్త్రం ప్రజల జీవన అభివృద్ధి కి ప్రయోగ పద్ధతిని వినియోగించడం లాంటి కోర్సుల ద్వారా వృత్తి పని వార్లకు కోర్సులు నిర్వహించారు.
సర్ హంఫ్రీ డేవీ, ఫారడే లాంటి వారి కృషి వల్ల ఈ పాలసీ సమూలంగా మారి పోయింది.
ఆండర్ సన్ ప్రయోగాత్మక భౌతిక శాస్త్రం మీద ఉపన్యాసాలు ఇవ్వడం ద్వారా మిదటి సారిగా సైన్సు బోధన చరిత్రను ప్రారంభించాడు.
19 వ శతాబ్దంలో మెకానిక్స్ సంస్థ ద్వారా ఈ కృషి కొనసాగింది.
విజ్ఞాన శాస్త్ర బోధన వల్ల సాంస్కృతిక ఫలితాలు ఉంటాయని ఊహించాడు.
1823 లో గ్లాస గో మెకానిక్స్ ఇన్స్టిట్యూట్ స్థాపించబడింది.
1866 లో ఈ ఇన్స్టిట్యూట్ టెక్నికల్ కాలేజి అయింది.
19 వ శతాబ్దం ఆరంభం లోనే ఇతర తాత్విక సంఘాలు విద్యను విస్తృతం చేసే కృషి చేశాయి.
19 వ శతాబ్దం అర్ధ భాగంలో కొన్ని స్కూళ్ళు సైన్సును బోధిస్తున్నాయి.
1847 లో థామస్ హాల్ రసాయిన శాస్త్ర పాఠశాలను లండన్ స్కూల్లో మొదలు పెట్టాడు.
1948 లో ఈ పాఠశాల శతాబ్ది ఉత్సవాలను జరుపుకుంది.
ఏ పాఠశాలలోనూ సైన్సును స్వతంత్రవిషయంగా బోధించడం లేదని రాయల్ ఎడ్యుకేషన్ కమిషన్ రిపోర్టు తెలిపింది.
రగ్ బై లో నేచురల్ సైన్సును భాషకు బదులుగా కోరుకున్న వారికి బోధించారు.
నేచురల్ సైన్సులో ఫిజిక్సు, కెమస్ట్రీ కూడిన విభాగాన్ని, కంపారిటివ్ ఫిజియాలజి, నేచురల్ హిస్టరీని రెండవ విభాగంగా నేర్పాలని ఆ కమిషన్వతన రిపోర్టులో పేర్కొన్నది.
దీని ఫలితంగా 1837 లో రగ్ బై లో డా" ఆర్నాల్డ్ ఆధ్వర్యంలో భౌతిక శాస్త్రాన్ని ప్రారంభించారు.
తర్వాత డా" టైట్ 1859 లో బోటని, కెమిస్ట్రీ, జియాలజి, అనే బోధనా విషయాలుగా ప్రారంభించాడు.
1851 లో ఏర్పాటు చేయపడ్డ ఒక ప్రదర్శన వల్ల విజ్ఞాన శాస్త్ర బోధనకు ఉత్సాహం పెరిగింది.
దీని వల్ల 1853 లో డిపార్ట్ మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ ఆర్ట్స్ నెలకొల్పబడింది.
1854 లో ప్రఖ్యాత శాస్త్రవేత్త లు విజ్ఞాన శాస్త్రాన్ని సాధారణ విద్య లో భాగం చేయాలని కోరారు.
టి.హెచ్.హక్జలీ విజ్ఞాన శాస్త్ర చరిత్రకు విద్యారంగంలో విలువ ఉందని ప్రసమగం చేశాడు.
జాన్ టింగాల్డ్ అనే ఆయన భౌతిక శాస్త్రాన్ని విద్యలో ఒక భాగం గా అధ్యయనం చేయాలని ఉద్యమించాడు.
ఫారడే శాస్త్రీయ దృక్పథాన్ని ప్రజల్లో వ్యాప్తి చేయవలసిన అవసరాన్ని నొక్కి చెప్పాడు.
1861 లో హెర్బట్ స్పెన్సర్ జీవాన్ని అనుసరించిన విజ్ఞానం భౌతిక నైతిక విజ్ఞానంలో చాలా అవసరమన్నాడు.
1860-70 దశకంలో హక్జలీ సైన్సు బోధన కొరకు కృషి చేసిన వారిలో ముఖ్యుడు.
ఆక్సఫర్డ్ ,కేంబ్రిడ్జి విశ్వ విద్యాలయాల్లో నేచురల్ సైన్సు ను ఒక కోర్సుగా నెలకొల్పడంతో సెకండరీ స్కూలు లోని పాఠ్యాంశంలో భాగం కావడానికి ఉపయోగపడుతుంది.
1895 లో ప్రచురించబడిన డెమాన్సియర్ కమిషన్ రిపోర్టులో అన్ని పాఠశాలల్లో నేచురల్ సైన్సు బోధనను వారానికి 6 గంటలు బోధించాలని ,భౌతిక రసాయిన శాస్త్రాలలో ప్రయోగాలు చేయడానికి అవసరమైన ప్రయోగశాళను నిర్మించాలని సూచించడం జరిగింది.
ఈ రిపోర్టు ప్రచురణ అనంతరం బాలుర పాఠ్యాంశాలలో భౌతిక శాస్త్రాలని, బాలికల వృక్ష శాస్త్రాన్ని బోధించడాన్ని ప్రవేశ పెట్టారు.
19 వ శతాబ్దం చివరలో ఆర్మ్ స్ట్రాంగ్ సెంట్రల్ టెక్నికల్ కాలేజిలో రసాయిన శాస్త్ర ప్రొఫెసర్ గా పని చేస్తూ అప్పటి వరకు పాటశాలల్లో అమలవుతున్న సైన్సు బోధన పద్ధతులను గురించి నిరసన వ్యక్తం చేశాడు.
విద్యార్ధులంతా విషయాలను తమంతట తాము కనుగొనే పరిశోధన అవకాశాన్ని కల్పించాలని కోరాడు.
దీన్నే హ్యూరిస్టిక్ పద్ధతి అంటారు.
సైన్సు బోధన పద్ధతి మారినా ఈనాటికీ ఈ పద్ధతి ఉద్దేశం కొనసాగుతూనే ఉంది.
20 వ శాతాబ్దం ఆరంభంలో ప్రయోగ పరికరాలు విద్యార్ధులకు అందుబాటులోకి వచ్చాయి.
1916 లోవిద్యా వ్యవస్థ, నేచురల్ సైన్స్ స్థితిగతుల గురించి సర్ . జె.డి.థాంప్సన్ ఒక కమిటి ని నియమించాడు.
ఈ కమిటి రిపోర్టు థాంప్సన్ రిపోర్టు గా ప్రచారమై నేచురల్ సైన్స్ ఇన్ ఎడ్యుకేషన్ పేరుతో ప్రచురిచతమైంది.
దీని ఫలితంగా చాలా పాఠశాలల్లో సైన్సులో చాలా ఉన్నత కోర్సులు ప్రవేశ పెట్టబడ్డాయి.
సైన్స్ మాస్టర్ల అసోసియేషన్ మరియు అసోసియేషన్ ఆఫ్ ఉమెన్ సైన్సు టీచర్స్ ఏర్పడ్డాయి.
1938 లో స్పెన్సర్ రిపోర్టు ను ఉపాధ్యాయలు వ్యతిరేకించినా
1943 లో నార్ వుడ్ రిపోర్టు లో సైనసు బోధనకు ప్రత్యేకంగా ఒక చాప్టర్ ను ప్రవేశ పెట్టారు.
దీని వల్ల 1944 ఎడ్యుకేషన్ యాక్ట్ 1945 లో అమలులోకి వచ్చింది, సైన్సు బోధనను మెరుగు పరచింది.
పై మార్పులు ఇంగ్లాండులో జరుగుతూ ఉన్నా ఇండియా కూడా ప్రభావితమైంది.
1877-92 సైన్సు బోధన గురించి భారత ప్రభుత్వం ఒక రిపోర్టు లో విచారం వ్యక్తం చేసింది.
20 వ శతాబ్దం ప్రారంభంలో కూడా సైన్స్ బోధన లేదు.
విశ్వ విద్యాలయం లో నామ మాత్ర సైన్సు ఉంది.
కొన్ని దశాబ్దాల క్రితం ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ ఏర్పడినా సైన్సును పాఠశాల బోధనలో భాగం చేయలేకపోయింది.
1953 లో వెలువడిన సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్ రిపోర్టులో ఉన్నత పాఠశాలల్లో సామన్య శాస్త్రాన్ని తప్పనిసరిగా అధ్యయనం చేయవలసిన విషయంగా చేర్చాలని సూచించారు.
* సైన్సు బోధన మీద ఆల్ ఇండియా సెమినార్.
1956 లో సిమ్లా హిల్స్ లోని టారాదేవి లో ఈ సదస్సు జరిగింది.
ఉన్నత పాఠశాలల్లో సైన్సు బోధనకు సంబంధించిన అన్ని విషయాలను ఈ సదస్సు చర్చించింది.
సిలబస్, పరికరాలు, పరీక్షా పద్ధతి, బోధన పరికరాలు, టెక్స్ట్ బుక్స్, సైన్స్ క్లబ్, మ్యూజియంల గురించి సస్సు చర్చించింది.
భారత దేశ వ్యాపితంగా ఒక ప్రత్యేకమైన ,ఒకే విధమైన విజ్ఞాన శాస్త్ర బోధన ఉండవలసిన అవసరాన్ని సూచించింది.
* ఇండియన్ పార్లమెంటరీ అండ్ సైంటిఫిక్ కమిటి.(1961)
ప్రభుత్వ విధానాలు , సమాజంపై చూపుతున్న ప్రభావం వల్ల రాజకీయ నాయకులు,శాస్త్రవేత్తలు ఒక చోట చేరి సైన్సు అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని, నూతన విధానాకను రూపొందించాలని అభిప్రాయ పడ్డారు.
జనాభా పెరుగుదల, శిక్షణ పొందిన ఉపాధ్యాయుల కొరత, సైన్సు అభివృద్ధి, సాంకేతిక శిక్షణ కల మానవ వనరుల కొరత, మానవజీవన విధానంలో సైన్సు పాత్ర, సైన్సు లక్ష్యాలు, విధానాల్లో మార్పులు మిదలైన విషయాలను అధ్యయనం చేసింది.
* 1963 లో యునెస్కో ప్లానింగ్ మిషన్ వారు భారత దేశాన్ని సందర్శించారు.
సైన్సు, గణితం బోధనలకు సంబంధించి సూచనలు చేశారు.
వీరి సూచనల ఆధారంగా డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ వారు నూతన కరిక్యులం, టెక్స్ట్ పుస్తకాలు, ఉపాధ్యాయ మార్గ దర్శినులను, రూపొందించడం మొదలు పెట్టారు.
* కొఠారి కమిషన్ రిపోర్టు (1966)
డా" కొఠారి అధ్యక్షతన 21-4-1966. న సైన్స్ ఎడ్యుకేషన్ సదస్సు జరిగింది.
సైన్స్ ఎడ్యుకేషన్ ప్రణాళికల ఏర్పాటు కొరకు ఈ సదస్సు జరిగింది.
భారత, రష్యా, అమెరికా లకు చెందిన యునెస్కో నిపుణులు ఈ సదస్సులో పాల్గొన్నారు.
దేశాభివృద్ధి, సంక్షేమం, రక్షణ, ప్రణాళికా బద్ధమైన సైన్సు మరియు టెక్నాలజి పరిశోధన, బోధనల పైన ఆధారపడుతుందని , సైన్సు విశ్వజనీనమైనదనీ, సైన్సు సర్వ మానవాళి కృషి ఫలితం కాన దాని అభివృద్ధి వేగంగా ఉంటుందనీ, ప్రతి ఐదు సంవత్సరాలకు సైన్సు రెట్టింపు అవుతుందనీ ఇమడియన్ ఎడ్యుకేషన్ కమిషన్ తన రిపోర్టులో తేల్చింది.
సైన్సు బోధన చాలా దయనీయ స్థితిలో ఉందనీ, పెరుగుతున్న విజ్ఞానంతో పోటీ పడలేకపోతే మరింత అధ్వాన్న స్థితికి చేరతామనీ, అందువల్ల కరిక్యులం లో పరిశోధన జరగాలనీ, టెక్స్ట్ పుస్తకలను సవరించాలనీ, బోధన పరికరాలను సమూల మార్పులకు గురి చేయాలనీ ఈ కమిటి తేల్చింది.
ఈ కొఠారి అధ్యక్షతన సాగిన ఇండియన్ ఎడ్యుకేషన్ కమిషన్ చేసిన సూచనలు:
* మొదటి పది సంవత్సరాల పాఠశాల విద్యలో సైన్సు, లెక్కలను తప్పనిసరిగా అధ్యయనం చేయాలనీ,
*బాలలకు పరిసరాల అవగాహన కల్పించాలనీ,
* అంతర్జాతీయ కొలతలను పరిచయం చేయాలనీ,
* ఉన్నత పాఠశాల స్థాయిలో విజ్ఞానార్జన, తర్కబద్ధంగా ఆలోచింప చేయడం, ఉన్త స్థాయిలో నిర్ణయాలు చేయగలగడాన్ని నేర్పాలనీ,
* శాఖా భేదాలను గమనించే విధంగా సైన్సు బోధన చేయాలనీ,
* ప్రయోగశాలకు ప్రాధమిక పాఠశాలలో ఒక ప్రత్యేక స్థానం ఉండాలనీ,
* అన్ని ఉన్నత పాఠశాలల్లో ప్రయోగశాలలు, మీటింగ్ హాళ్ళు ఉండాలనీ,
* ఉన్నత పాఠశాల స్థాయిలో సైన్సును అవగాహనయుతంగా బోధించాలనీ,
* భౌతిక, రసాయిన,జీవ శాస్త్ర విషయాలకు ప్రయోగశాలలు తప్పనిసరిగా ఉండాలనీ,
* ముందుగా కొన్ని పాఠశాలలను ఎన్నుకుని ప్రయోగశాలలను నిర్మించాలనీ,
* ప్రయోగశాలల వసతులను పెంచాలనీ కమిటీ సూచనలు చేసింది.
ఈ కొఠారి కమిషన్ సూచనలను పాఠశాలల్లో ప్రణాళికాబద్ధంగా అమలు చేయలేక పోయారు.
దశాబ్దాల పాటు ఈ సూచనలను అమలు చేయలేకపోవడంతో విద్యా రంగం బలహీన పడుతూ వచ్చింది.
ఈ కమిటీ సూచనలను ఈనాటికీ అమలు చేయవలసినవి ఉన్నాయి.