Tuesday, 28 September 2021

జాషువా జయంతి సందర్భంగా సెమినార్ :: JVV, ప్రొద్దుటూరు


ఈరోజు జాషువా జయంతి సందర్భంగా జన విజ్ఞాన వేదిక ప్రొద్దుటూరు ఆఫీసులో జాషువా జీవితం పై సెమినార్ను నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో జన విజ్ఞాన వేదిక  కడప జిల్లా సాంస్కృతిక విభాగం కన్వీనర్ రంగనాయకులు గారు పాల్గొని జాషువా తన జీవితంలో   అణగారిన వర్గాల స్వతంత్రం కోసం ఎంతో కృషి   చేశారని తెలియజేశారు జాషువా గారు భారతీయ సమాజాన్ని సాహిత్యంగా ప్రజాస్వామికంగా స్వేచ్ఛ సమానత్వం సౌభ్రాతృత్వం  మూడు సూత్రాల మీద సమాజం  ఏర్పడాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో జాషువా  రాసిన గిజిగాడు గబ్బిలం కావ్యాల సారాంశాన్ని తెలియజేశారు జాషువా జయంతిని పురస్కరించుకొని  కరపత్రాలను విడుదల చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ప్రొద్దుటూరు పట్టణ అధ్యక్షులు ప్రకాష్ గారు  పట్టణ ప్రధాన కార్యదర్శి నంగా రాజేష్ గారు పొద్దుటూరు జనవిజ్ఞాన వేదిక నాయకులు మురళి  ఉత్తం రెడ్డి చంద్రశేఖర్ మధుగారు మొదలగు వారు పాల్గొన్నారు

No comments:

Post a Comment