Friday, 24 December 2021

జన విజ్ఞాన వేదిక రాష్ట్ర స్థాయి చెకుముకి సైన్స్ సంబరాల కరపత్రాన్ని ఆవిష్కరిస్తున్న ఎమ్మెల్సీ K.S. లక్ష్మణరావు గారు

జన విజ్ఞాన వేదిక రాష్ట్ర స్థాయి చెకుముకి సైన్స్ సంబరాలు వచ్చే జనవరి 8, 9 తేదీల్లో గుంటూరులోని పాటిబండ్ల సీతారామయ్య హై స్కూల్ లో నిర్వహిస్తున్నట్లుగా ఎమ్మెల్సీ కే.ఎస్. లక్ష్మణరావు గారు తెలిపారు గుంటూరులోని యు.టి.ఎఫ్. కార్యాలయంలో చెకుముకి సైన్స్ సంబరాల కరపత్రాన్ని శనివారం ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా లక్ష్మణ రావు గారు మాట్లాడుతూ విద్యార్థులలో శాస్త్రీయ దృక్పథాన్ని, ప్రశ్నించే తత్వాన్ని పెంపొందించడానికి గత 30 ఏళ్లుగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఉపాధ్యాయులు ప్రధానోపాధ్యాయులు ఈ కార్యక్రమానికి సహకరించాలని కోరారు రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు రాజశేఖర్ రాహుల్, మురళీధర్ లు మాట్లాడుతూ ఇప్పటికే పాఠశాల స్థాయిలో నిర్వహించిన పోటీల్లో నాలుగున్నర లక్షల మంది విద్యార్థులు పాల్గొన్నారని తెలిపారు. వారికి జిల్లా స్థాయి పోటీలు నిర్వహించి విజేతలను రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేసినట్టుగా చెప్పారు. ఆంధ్రప్రదేశ్ లోని 13 జిల్లాల నుండి 52 బృందాలు ఈ చెకుముకి సంబరాల్లో పాల్గొననున్నట్లు ఆయన తెలిపారు. రెండు రోజుల పాటు జరిగే సంబరాలలో  క్విజ్, శాస్త్రవేత్తల తో ముఖాముఖి, సైన్స్ ప్రయోగాలు ఇతర కార్యక్రమాలు నిర్వహిస్తారని తెలిపారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు త్రిమూర్తులు రెడ్డి, శ్రీనివాసరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment