Thursday, 24 January 2019

జాతీయ గీతం, జాతీయ గేయం ఆమోదం పొందిన రోజు :: జనవరి 24, 1950

*💦జనవరి 24💦*

*🌼 జాతీయ గీతం, జాతీయ గేయం ఆమోదం పొందిన రోజు.*

భారత ప్రజాస్వామ్య వ్యవస్థను గౌరవించే విధంగా రూపొందించబడిన జాతీయగీతం, గేయంను రాజ్యాంగ పరిషత్తు 1950 జనవరి 24న ఆమోదించడం జరిగింది.

మన జాతీయగీతం 'జనగణమన"ను రవీంద్రనాథ్ ఠాగూర్ గారు బెంగాళి భాషలో రచించారు. ఈ గీతం భారతదేశ సంసృతిని, నైసర్గిక స్వరూపాన్ని వివరిస్తుంది. దీనిని మొదటిసారిగా 1911 డిసెంబరు 27న కలకత్తా కాంగ్రెసు మహాసభలో ఆలపించడం జరిగింది.

        మన జాతీయగేయం అయిన "వందేమాతరం' ను బంకించంద్ర చటర్జీ గారు రచించిన "ఆనంద్ మఠ్” నవల నుండి స్వీకరించడం జరిగింది. ఈ గీతం స్వతంత్ర పోరాటకాలంలో దేశం మొత్తాన్ని ఉర్రూతలూగించింది. బ్రిటీష్ వాని గుండెల్లో విప్లవనాదమై పేలింది. జాతీయగీతంను, గేయంను ఆలపించడం, జాతీయచిహ్నాలను గౌరవించడం ప్రతీ పౌరుడి ప్రథమ కర్తవ్యం.
~~~~~~~~~~~~~

*జనగణమన..భారత జాతీయగీతం గా రాజ్యాంగ సభ స్వీకరించిన రోజు నేడే..*

నోబెల్ బహుమతి గ్రహీత, రవీంద్రనాథ్ టాగోర్ రాసిన బెంగాలీ గీతం లోని మొదటి భాగం ఇది. 1911లో మొదటి సారిగా పాడిన ఈ గీతాన్ని 1950 జనవరి 24 న జాతీయగీతంగా రాజ్యాంగ సభ స్వీకరించింది.

ఈ గీతానికి సంగీత బాణీ కూడా టాగోరే సృష్టించాడు. బాణీ కనుగుణంగా ఈ గీతాలాపన చేసేందుకు 52 సెకండ్లు పడుతుంది. అప్పుడప్పుడు మొదటి, చివరి పాదాలను మాత్రమే పాడే పద్ధతి కూడా ఉంది. దీనికి 20 సెకండ్లు పడుతుంది.

ఠాగూర్ జనగణమనను 1919 లో మదనపల్లెలో ఆంగ్లములోకి తర్జుమా చేశాడని భావిస్తారు. ఈ తర్జుమా ప్రతి నేటికి నీ బీసెంట్ థియోసాఫికల్ కాలేజి మదనపల్లె లో యున్నది.

మొదటిసారి బహిరంగంగా జనగణమన గీతాన్ని ఆలపించింది మదనపల్లెలోనే. 1919 ఫిబ్రవరి 28న తన స్నేహితుడు, బిసెంట్ థియోసాఫికల్ కాలేజి ప్రిన్సిపాలు అయిన జేమ్స్ హెచ్. కజిన్స్ కోరిక మేరకు కొంత మంది విద్యార్థులను ప్రోగు చేసుకొని జనగణమనను బెంగాలీలో ఆలపించాడు

దేశ ప్రజల్లో జాతీయ వాదాన్ని పెంపొందించే స్ఫూర్తిదాయక గీతం ‘జనగణ మన’. దీన్ని ఆలపించేటప్పుడు విధిగా కొన్ని నియమ నిబంధనలను మనం పాటించాలి. విద్యా సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు, అధికారిక కార్యక్రమాల్లో దీన్ని ఆలపించాలి. సభలు, సమావేశాలు జరిగినపుడు అందరూ లేచి నిలబడి సామూహికంగా ఆలపించాలి.

దీన్ని ఆలపించడం అంటే- కార్యక్రమం ముగింపో లేదా ఆ రోజుకి సమయం ముగిసిందని అనుకోరాదు. దేశ ఔన్నత్యాన్ని మననం చేసుకుని, జాతీయతా భావంతో ముందుకు సాగడానికి ఇది స్ఫూర్తిని నింపుతుంది. మన దేశ భౌగోళిక, సాహిత్య, సాంస్కృతిక వారసత్వ సంపదను గుర్తు చేసుకుంటూ దేశం పట్ల గౌరవ భావం నింపుకోవడమే దీని ఉద్దేశం. ఈ ఆశయంతోనే దీన్ని మన జాతీయగీతంగా గుర్తించారు.

🔹జైహింద్..

No comments:

Post a Comment