Sunday, 26 April 2020

కరోనా కట్టడి లో 'కేరళ మార్గం' దేశానికే ఆదర్శం :: పాట్రిక్ హెల్లర్


  సమానత్వభావన వారసత్వాలు, సామాజిక హక్కులు, ప్రజల విశ్వాసమే పునాదిగా కేరళ రాష్ట్రం కరోనా వైరస్ సంక్షోభాన్ని అధిగమించింది.ప్రపంచ కరోనా వైరస్ మహమ్మారి క్రూర ప్రయోగమైనప్పటికీ ,  సహజమైనది.  ప్రపంచంలో ప్రతి దేశం గణనీయంగా దాని ప్రభావానికి గురైంది.మనం గమనిస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రతిస్పందనల స్థాయి, ఉనికిలో ఉన్న అసమానతలను తెలియజేయడమే కాక, స్పందించే ప్రభుత్వాల రాజకీయ,సంస్థాగతమైన సామర్థ్యాన్ని కూడా తెలియజేస్తుంది. భారతదేశంలో కన్నా ఇది మరే దేశంలోనూ వాస్తవం కాదు.కేంద్రప్రభుత్వం 'లాక్ డౌన్' ను ప్రకటించింది.కానీ వైరస్ వ్యాప్తి అదుపు, 'లాక్ డౌన్' ఫలితంగా ఉత్పన్నమయ్యే సంక్షేమ సమస్యలు రెండింటినీ పరిష్కరించే చర్యలు అమలు చేయాల్సింది రాష్ట్ర ప్రభుత్వాలు. దేశంలో అనేక రాష్ట్రాలు చొరవ ప్రదర్శిస్తూ ఉన్నాయి.కానీ కేరళ రాష్ట్రం కన్నా ఎక్కువ చొరవ చూపించే రాష్ట్రమేదీ భారతదేశంలో లేదు.
  మొదటి కరోనావైరస్ కేసు కేరళ రాష్ట్రంలో నమోదై, దేశంలోనే ఎక్కువ మందికి వైరస్ సోకిన కేసులు నమోదైన మొదటి రాష్ట్రంగా  ఉన్నప్పటికీ, ప్రస్తుతం రాష్ట్రాలన్నింటితో పోలిస్తే 10 వ స్థానంలో ఉంది.వారం రోజులుగా వైరస్ సోకిన కేసుల సంఖ్య
క్షీణిస్తూ, ప్రస్తుతం ఆ సంఖ్య కోలుకున్న రోగుల సంఖ్య కన్నా తక్కువగా ఉంది.కేరళ  రాష్ట్ర ప్రజలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థతో లోతైన సంబంధాలు కలిగి ఉండడం, అంతర్జాతీయంగా ఏ దేశానికైనా  తేలికగా వెళ్ళగలగడం వల్ల కేరళ  ఒక అపాయకరమైన ప్రాంతం(హాట్ స్పాట్)గా గుర్తించబడింది. 
రాష్ట్ర ప్రభుత్వం వక్రరేఖను సమాంతర రేఖగా మార్చడమే కాక, కేంద్ర ప్రభుత్వం 'లాక్ డౌన్'ను  ప్రకటించడానికి ముందే 20 వేల కోట్ల ఆర్థిక ప్యాకేజీని ప్రకటించింది.అంతర్జాతీయంగా, జాతీయంగా కేరళ రాష్ట్రానికి ప్రత్యేకంగా ఎందుకు అంత గుర్తింపు వచ్చింది?
  సామాజిక అభివృద్ధిలో కేరళ రాష్ట్రం విజయం సాధిస్తుందన్న ముందస్తు సూచిక, అపరిమితమైన ఆ రాష్ట్ర సాంస్కృతిక, చారిత్రక సిద్ధాంతాల్ని, దాని భౌగోళిక ప్రత్యేకతలను గుర్తించింది.ఒక మహమ్మారిని లొంగ తీసుకొని, వేగంగా భారీఎత్తున సంరక్షణా కేంద్రాలు ఏర్పాటు చేసిన తీరు ప్రాథమికంగా ఆ రాష్ట్ర ప్రజలకు, రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న సంబంధాన్ని తెలుపుతుంది.1957లో జరిగిన మొదటి అసెంబ్లీ ఎన్నికల నుండి  కమ్యూనిస్ట్, కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వాల ప్రత్యామ్నాయ పాలనల ద్వారా సామాజిక సమీకరణలు, ప్రభుత్వాల జవాబుదారీతనం ఒక బలమైన సామాజిక ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పాయి.ప్రస్తుత సంక్షోభం సామాజిక ప్రజాస్వామ్యం యొక్క సాపేక్ష ప్రయోజనాల గురించి నొక్కి చెబుతుంది. 
  మొదటిది,పౌరులందరికీ విశాల ప్రాతిపదికన ప్రాథమిక సంక్షేమ సౌకర్యాలు సమకూరుస్తామన్న రాజకీయ నిబద్ధతతో కూడిన సామాజిక ఒప్పందం లేదా ఒడంబడిక పై ఆధారపడి సామాజిక ప్రజాస్వామ్యం నిర్మించబడుతుంది.కేరళలో ప్రజాదరణ పొందిన ప్రజాఉద్యమాల సంఘటనల నుండే సామాజిక ఒప్పందం ఉద్భవించింది.అవి 1930లో జరిగిన ఆలయ ప్రవేశ ఉద్యమం నుండి 1950లు మరియు1960లలో జరిగిన రైతాంగ,కూలీల ఉద్యమాలు,1980లలో పెద్ద ఎత్తున జరిగిన అక్షరాస్యతా ఉద్యమం,1990లలో కేరళ శాస్త్ర సాహిత్య పరిషత్ నాయకత్వంలో జరిగిన ప్రజా వికేంద్రీకరణ ప్రణాళికోద్యమం,ఇటీవల కాలంలో జరిగిన  లింగ , పర్యావరణ ఉద్యమాలు. ఈ ఉద్యమాలు సామాజిక పౌరసత్వమనే బలమైన భావాన్ని పెంచిపోషించడమే కాక, ప్రజా చైతన్యం కొరకు అవసరమైన న్యాయపరమైన, సంస్థాగతమైన  సామర్థ్యాన్ని పెంచే సంస్కరణలను ముందుకు నడిపించాయి.రెండవది,హక్కుఆధారిత సంక్షేమానికి ప్రాధాన్యత ఇవ్వబడింది.మళ్ళీఅదే ప్రాధాన్యత, రాష్ట్ర పాలకులను నిరంతరం తమ జవాబుదారీతనాన్ని డిమాండ్ చేసే బలమైన వ్యవస్థీకృత  పౌర సమాజాన్ని తిరిగి ప్రవేశ పెట్టింది.మూడవది,  నిరంతరం ప్రభుత్వాన్ని ఒత్తిడి చేసే వ్యవస్థీకృత పౌరసమాజం  మరియు పోటీ పార్టీ వ్యవస్థ (అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ అనే దానితో నిమిత్తం లేకుండా) ప్రజాసేవా కార్యక్రమాలకు పూనుకోవాలని, సామాజిక రక్షణ చర్యల ఏర్పాట్లు నిరంతరం విస్తరించాలని, ముఖ్యంగా భారత దేశంలో బ్రహ్మాండమైన ప్రజారోగ్య వ్యవస్థను అభివృద్ధి చేయాలని కేరళ ప్రభుత్వాలను ఒత్తిడి చేశాయి.నాల్గవది,ఆ ఒత్తిడే, స్థానిక సంస్థలకు అధికారాలు ఉండాలని రెండు దశాబ్దాలకు పైగా  కేరళ రాష్ట్రం చేస్తున్న ప్రయత్నాలకు ఆజ్యం పోసింది. భారతదేశంలో కేరళ రాష్ట్రంలో స్థానిక సంస్థలకు ఉన్న వనరులు, వాటికున్న సామర్థ్యం ఏ రాష్ట్రంలోని స్థానిక సంస్థలకు లేవు.చివరగా, ఇవన్నీ కలిసి ప్రజలను అధీనులుగా కాక , హక్కుదారులైన పౌరులుగా ఆదరించే ప్రభుత్వం అనే సాధారణ విశ్వాసాన్ని ఇచ్చే ఒక లోతైన ప్రజాస్వామ్యపు ఆస్తి గా మారుతాయి.
 వక్రరేఖను సమాంతరం చేసి, ప్రజలకు లబ్ది చేకూర్చే సంక్షేమ చర్యలను విశాల ప్రాతిపదికన చేపట్టే సామర్థ్యం కేరళకు ఎలా సాధ్యమైంది?కోవిద్-19 లాంటి మహమ్మారి సంక్షోభానికి ప్రతిస్పందించే కేరళ ప్రభుత్వం, ఆర్థిక మరియు సామాజిక వనరుల సమీకరణల పైన, మార్గదర్శకాలను అమలు చేసే అధికారుల పైన, విభిన్న రంగాలకు చెందిన అధికారులతో జరిగే సమన్వయంపైన, ముఖ్యంగా ప్రభుత్వ నియమనిబంధనలను పాటించే ప్రజలపైన ఆధారపడుతుంది. ప్రణాళికాబద్ధమైన నిర్ణయాలతో ఒక సమర్థవంతమైన ప్రతిస్పందన ప్రారంభం అవుతుంది.
  కేరళలో కరోనా వైరస్ సోకిన మొదటి కేసు నమోదు అయిన దగ్గర నుండి ముఖ్యమంత్రి పినరయి విజయన్,విభిన్నమైన విధులు నిర్వహిస్తూ, 18 టీంలను సమన్వయ పరిచే 'రాష్ట్ర ప్రతిస్పందన టీం'తో,   ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాతో ప్రతి రోజూ సమావేశం నిర్వహించి, నిరంతరం ప్రజలతో సంభాషించాడు.కేరళ సామాజిక ఒడంబడిక తక్కువేమీ డిమాండ్ చేయలేదు.విజయన్ ప్రత్యక్షంగా మళయాళీల పౌరసత్వ భావనకు  మనవిచేయడమే కాక, వైరస్ కు వివక్షత ఉండదని, దానిని అణచివేయాలన్న విషయాన్ని కూడా ప్రజలకు గుర్తు చేశాడు.
  రెండవది, ఇటీవల ప్రైవేటు ఆరోగ్య సేవల వృద్ధి లో పెరుగుదల ఉన్నప్పటికీ,బలమైన ప్రజల ఉనికిని కాపాడుతున్న  విశాలమైన ప్రజారోగ్య చికిత్సా విధానం ద్వారా కేరళ ప్రభుత్వం సాధ్యమైనంత వరకు లబ్దిపొందగలిగింది.ప్రజా ప్రయోజనాల లక్ష్యం తోనే ఏర్పడిందంటున్న  ప్రైవేట్  వ్యవస్థ ఆ లక్ష్యాన్ని సాధించలేదు. అమెరికాలో లాభాపేక్షతో ఏర్పడిన ఆరోగ్య వ్యవస్థ గందరగోళంలో పడింది. లాభాపేక్ష తో ఏర్పడిన అలాంటి ఆరోగ్య వ్యవస్థలు ఎదుర్కొంటున్న సమన్వయ సమస్యలను బహిర్గతం చేసే మహమ్మారి లాంటిది మరొకటి లేదు.కేరళ ప్రజారోగ్య సంరక్షణా కార్మికులు సంఘటితమై, సంఘాలు కూడా స్థాపించుకున్నారు. కేరళ ప్రభుత్వం మొదటినుండి వారి ఆరోగ్య రక్షణకు అధిక ప్రాధాన్యతనిస్తుంది.
  మూడవది, ప్రభుత్వం అప్పటికే సిద్ధంగా ఉన్న పౌరసమాజాన్ని చైతన్య పరిచింది.వ్యాధిగ్రస్తుల సంఖ్య పెరగడంతో, ఇంటింటికీ వెళ్లి ఇబ్బంది పడుతున్నవారిని,అవసరాలలో ఉన్న వారిని గుర్తించడానికి గాను  రెండు లక్షల మందిని రంగంలోకి దించింది.పౌరసమాజంతో కలిసి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యక్షంగా వ్యాధి నివారణా, సహాయక చర్యల్లో సమర్థవంతంగా పాలుపంచుకుంది.వ్యాధి సోకిన వ్యక్తులు ఎవరెవర్ని కలిశారో గుర్తించే పని నుండి  కుదుంబశ్రీ కమ్యూనిటీ వంటశాలల ద్వారా రోజుకు మూడు లక్షల భోజనాలను ఇంటికి సరఫరా చేసే పని వరకు ప్రభుత్వ ప్రత్యక్ష జోక్యం ఉంది. కేరళలో మహిళా సాధికారత అమలు రుజువుకు 'కుదుంబశ్రీ' సేవలు మంచి ఉదాహరణ.
 నాల్గవది, రాజకీయాలు నిజాయితీగా ఉన్నప్పుడు , ఒక మంచి ప్రజారోగ్య రక్షణ వ్యవస్థ ఉంటుంది. ఇటువంటి సంక్షోభ సమయంలోనే క్షేత్రస్థాయిలో పొందాల్సిన ప్రయోజనాలు ప్రజలు పొందినప్పుడు ఆ వ్యవస్థ ప్రభావం ఏమిటో తెలుస్తుంది.ఇదే రెండు దశాబ్దాల కాలంలో స్థానిక సంస్థలకున్న అధికారాల ఫలితంగా  కేరళ రాష్ట్రం పొందిన ప్రయోజనం. వ్యాధి సోకిన ప్రాంతాల్లో వైరస్ ను అదుపులోకి తెచ్చే చర్యలపై కేంద్రీకరించడం, వైరస్ సోకిన వారిని గుర్తించడం,వలస కార్మికులకు, వృద్ధులు మొదలైన వారు ప్రత్యక్షంగా పొందాల్సిన ప్రయోజనాలు పొందేట్లు చూడడంలో పంచాయతీ, జిల్లా, మున్సిపాలిటీ స్థాయిలో తీసుకునే చర్యలను సమన్వయం చేయడంలో ప్రజల,అధికారుల పాత్ర కీలకమైనది.
  సామాజిక శరీరానికి ఈ మహమ్మారి ఒక భౌతిక పరీక్ష . ప్రజా విశ్వాసాన్ని ఇంతవరకు పరీక్షకు పెట్టలేదు.ప్రజాస్వామ్య వ్యవస్థల్లో ప్రజల విజ్ఞప్తులకు ప్రతిస్పందనలు ఉండాలి.ప్రజలను ఇంటి వద్ద ఉండమని,పని చేయొద్దని చెప్పడం, సమాజ హితం కొరకు వారు ఇప్పుడు చేస్తున్న వ్యక్తిగత త్యాగాలు అవసరం అని నమ్మడం అంత తేలిక కాదు, మరీ ముఖ్యంగా కనిపించని ఒక శత్రువుకు అసలు వ్యతిరేకం కాదు.విశ్వాసాన్ని కొలవడం కష్టం.కానీ ఇటీవల కాలంలో బెంగళూరు కు చెందిన ఒక ప్రభుత్వేతర సంస్థ " జనాగ్రహ "తో నా సహచరులు, నేను కలిసి 'కొచ్చి'తో పాటు పది భారతదేశ నగరాలలో చేసిన సర్వే, అన్ని వర్గాల, కులాల మరియు మతాలలో ఉన్న ప్రజల్లో వారి ప్రభుత్వం పట్ల, స్థానికంగా ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధుల పట్ల అందరి కన్నా ఎక్కువ స్థాయి విశ్వాసం ఉన్నవారు మళయాళీయులని రుజువు చేసింది. ఇది అన్నిటికన్నా శక్తివంతమైన, ఆరోగ్యకరమైన 'కేరళ సామాజిక ఒడంబడికను' సూచిస్తుంది. 
  ప్రపంచంలో ప్రతి దేశం ముఖ్యంగా భారతదేశం, వైరస్ మహమ్మారి సంక్షోభం ఫలితంగా ఏర్పడే ఆర్థిక,సంక్షేమ సమస్యలను కొన్ని సంవత్సరాల పాటు ఎదుర్కొంటుంది.ఈ క్రూరమైన, ఉహించని దెబ్బ ప్రజాస్వామిక పౌరసత్వ సవాళ్ళను బహిర్గతం చేస్తుంది.ఈ సంక్షోభ సమయాన, కొందరి పెత్తందారీ దుష్క్రత్యాలు నిలువరించలేని విధంగా ఉన్నాయి. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ " సర్వ" ఆధిపత్యాన్ని ప్రదర్శించి,గవర్నర్ల అధికారాలను బలవంతంగా లాక్కొనే లక్ష్యంతో బెదిరిస్తున్నాడు. భారతీయ జనతాపార్టీ  మహమ్మారిని మతతత్వీకరణ చేయడానికి,తన విమర్శకులను మాట్లాడకుండా చేయడానికి ఈ సంక్షోభాన్ని ఒక అవకాశంగా ఉపయోగించుకుంటుంది.భారతదేశ ప్రజాస్వామ్యం సంక్షోభంలో ఉన్నప్పుడే,కేరళ రాష్ట్రం వైరస్ సంక్షోభాన్ని పట్టుదలతో, సానుభూతితో దేశంలో ఏ రాష్ట్రం సాధించని ఫలితాలతో ఎదుర్కొంటుంది.సమానత్వ భావన వారసత్వాలు, సామాజిక హక్కులు, ప్రజల విశ్వాసం తోనే ఇది సాధ్యమైంది.
(రచయిత US లో బ్రౌన్ యూనివర్సిటీ ప్రొఫెసర్)

No comments:

Post a Comment