Tuesday, 12 October 2021

సరైన సమాచారంతోనేపారదర్శకత - :యం.రాం ప్రదీప్ :: నేడు సమాచార హక్కు చట్టం ఏర్పడిన రోజు

స్వాతంత్ర్య అనంతరం కేంద్రం
తీసుకొచ్చిన మంచి చట్టాల్లో
సమాచార హక్కు చట్టం ఒకటి.భారత రాజ్యాంగం ప్రకారం ప్రజలే అంతిమ న్యాయ నిర్ణేతలు.ప్రజాస్వామ్యంలో ప్రజా తీర్పుకు తిరుగులేదు. ఎన్నికల్లో గెలిచిన ప్రజాప్రతినిధులు ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన చేయాల్సి ఉంటుంది.

ప్రభుత్వాలు  ప్రజల నుంచి వివిధ రూపాల్లో పన్నులు వసూలు చేసి అభివృద్ధి పనులు చేపడతాయి. ప్రజా సంక్షేమానికి నిధులు మంజూరు చేస్తాయి. ఏ పథకానికి ఎన్ని నిధులు మంజూరు అయ్యాయి,ఎంత ఖర్చు పెట్టారు అనే విషయాలు ప్రజలకు తెలియజెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంటుంది. అప్పుడే పాలకులు
అవినీతి రహిత పాలనని అందించగల్గుతారు.అందుకు వారు సరైన,ఖచ్చితమైన సమాచారాన్ని ప్రజలకు అందుబాటులో ఉంచాలి.
దేశంలో అనేక ఉద్యమాల ఫలితంగా 2005 అక్టోబర్ 12న
సమాచార హక్కు చట్టం అమల్లోకి వచ్చింది. ఈ చట్టం ద్వారా కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు
సమాచార కమీషన్ లని ఏర్పాటు చేయాలి. రాజకీయ నేపథ్యంలేని,నేర చరిత్ర లేని వ్యక్తులని సభ్యులుగా నియమించాలి.వారు వివిధ రంగాలలో నిపుణులు అయి
ఉండాలి.

సమాచార హక్కు చట్ట ఫలితంగా కొంతవరకు దేశంలో 
అవినీతి రహిత పాలన అందింది.పౌరులలో కూడా చైతన్యం పెరిగింది.రాను రాను
సమాచార హక్కు చట్టం స్ఫూర్తి 
దెబ్బతింటుంది.సమాచారం కోరే వారిపై దాడులు చేస్తున్నారు.సమాచారం అడిగినా సక్రమంగా ఇవ్వడంలేదు. అధికారుల నియామకాల్లో రాజకీయ నాయకుల జోక్యం పెరుగుతుంది. ఒక వ్యక్తి
సమాచారం అడిగితే నెల రోజులలోపు అధికారులు ఇవ్వాలి.ప్రభుత్వ కార్యాలయాలలో తప్పనిసరిగా
సహ చట్టం వివరాలు పొందుపర్చాలి.దేశ భద్రతకు సంబంధించినవి తప్ప, మిగతా
సమాచారాన్ని ప్రజలకు అందుబాటులో ఉంచాలి.
సహ ఉద్యమ కారులకి రక్షణ
కల్పించాలి.కమిషన్ స్వతంత్రంగా పని చేయడానికి
వీలు కల్పించాలి. అప్పుడే
అధికారులు పౌరులకు సత్వర
సేవలు అందిస్తారు


తిరువూరు
9492712836 


No comments:

Post a Comment