భారత రాజ్యాంగం ప్రకారం ప్రతి
పౌరుడు శాస్త్రీయ దృక్పథంని
అలవర్చుకోవాలి. కానీ పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని
కొందరు సమాజంలో సరికొత్త మూఢ నమ్మకాలని పెంచి పోషిస్తున్నారు. సైన్స్ పట్ల ఆసక్తి పెంచడానికి,ప్రజల్లో శాస్త్రీయ ఆలోచనలు పెంచడానికి జనవిజ్ఞాన వేదిక వంటి సైన్స్ ప్రచార సంస్థలు విశేష కృషి చేస్తున్నాయి.
విద్యార్థులలో రసాయన శాస్త్రం పట్ల ఆసక్తి పెంచడానికి
అక్టోబర్ 23న మోల్ డేని ప్రతి ఏటా జరుపుతారు.1980వ దశకం నుంచి ఈ దినోత్సవం జరుపుతున్నారు.
19వ శతాబ్దంలో పరమాణువు
ద్రవ్యరాశుల్ని కనుగొనడానికి ఎలాంటి సౌకర్యాలు లేవు.అందుకే రసాయన శాస్త్ర వేత్తలు ఈ విలువలను ప్రయోగాల ద్వారా సాపేక్షంగా
నిర్ధారించారు. ఈనాడు పరమాణువుల ద్రవ్యరాశిని కచ్చితంగా కనుగొనడానికి మాస్ స్పెక్ట్రో మీటర్ వంటి పరికరాలు ఉపయోగిస్తున్నారు.
పదార్ధంలో ఉండే పరమాణువుల పరిమాణం చాలా చిన్నదిగా ఉంటుంది. చాలా కొద్ది పదార్థాన్ని తీసుకున్నా అందులో అతి పెద్ద
సంఖ్యలో కణాలు ఉంటాయి.ఉదాహరణకు 18 గ్రాముల నీటిలోను,12 గ్రాముల కార్బన్ లోను కణాల సంఖ్య సమానంగా ఉంటాయి. ఈ సంఖ్య చాలా పెద్దగా వుంటుంది. వీటిని చెప్పాలంటే
మనకు ఒక సంఖ్యా యూనిట్ అవసరం. ఈ సంఖ్యా యూనిట్ నే మోల్ అంటాం. ఏ పదార్ధంలో నైనా ఒక మోల్ లో
ఉండే కణాల సంఖ్య ఎల్లప్పుడూ స్థిరం.
ఒక మోల్ పదార్ధంలో ఉన్న కణాల సంఖ్యని అవగాడ్రో సంఖ్య అంటారు.దీని విలువ ఎల్లప్పుడూ 6.022x10 23కు సమానం.ఇటలీ శాస్త్రవేత్త అమెడియో అవగాడ్రో రసాయన శాస్త్రానికి చేసిన సేవకు గౌరవ సూచకంగా ఈ
సంఖ్యకు అతని పేరు నిర్ణయించారు. మోల్ అనే పదాన్ని విల్ హెల్మ్ ఆస్వాల్డ్ లాటిన్ పదమైన మోల్స్ నుండి
తీసుకున్నారు.దీని అర్ధం కుప్ప.
ఒక పెద్ద సంఖ్యకు మోల్ అనే ప్రమాణాన్ని వాడాలని 1967లో నిర్ణయించారు.
మన దేశానికి చెందిన కణాదుడు అనే ఋషి కణం యొక్క ఉనికిని ఊహించారు.తర్వాత డాల్టన్ తదితరులు చేసిన పరిశోధనల
ఫలితంగా అణువు,పరమాణువులపై ఆధునిక ప్రపంచానికి ఒక అవగాహన వచ్చింది.ప్రజల్లో సైన్స్ పట్ల
అవగాహన పెరగాలంటే మరో ప్రజా సైన్స్ ఉద్యమం రావాల్సిన అవసరం ఉంది
తిరువూరు
9492712836
No comments:
Post a Comment