Sunday, 24 October 2021

జన విజ్ఞాన వేదిక సభ్యత్వ క్యాంపెయిన్ ప్రారంభిస్తున్న ప్రకాశం జిల్లా డిఇఓ శ్రీ విజయ భాస్కర్ గారు

సమాజంలో వేళ్లూనుకుపోయిన మూఢనమ్మకాల నిర్మూలన కు విద్యావంతులైన ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా విద్యాశాఖ అధికారి విజయభాస్కర్ పేర్కొన్నారు జన విజ్ఞాన వేదిక సభ్యత్వ నమోదు కరపత్రాలు మరియు పోస్టర్స్ ను ఆయన శనివారం ఆవిష్కరించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ జన విజ్ఞాన వేదిక వారు శాస్త్ర విజ్ఞాన ప్రచారం కొరకు చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. పాఠశాల విద్యార్థులకు చెకుముకి సైన్స్ సంబరాలు ద్వారా సైన్స్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించడం కొనసాగించాలన్నారు. జెవివి రాష్ట్ర కార్యదర్శి కె. సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ JVV ద్వారా శాస్త్రవిజ్ఞాన ఫలితాలు సామాన్య ప్రజలకు కూడా చేరువయ్యేందుకు  విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నా మన్నారు. పర్యావరణ పరిరక్షణకు, ప్రజల మౌలిక సమస్యలక పరిష్కారాల కొరకు JVV పనిచేస్తుందన్నారు. జెవివి సభ్యత్వ నమోదుకు ఉపాధ్యాయులు ఉద్యోగులు విద్యావంతులు తమ వంతు సహకారాన్ని అందించాలని కోరారు. సభ్యత్వ నమోదులో జెవివి జిల్లా ప్రధాన కార్యదర్శి ch. జయ ప్రకాష్, జిల్లా కార్య వర్గ సభ్యులు,  నగర కోశాధికారి నాగేశ్వరరావు గారు పాల్గొన్నారు.

No comments:

Post a Comment